హైదరాబాద్ సిటీ, వెలుగు: జైపూర్ ఫొటోగ్రాఫర్స్ క్లబ్ నిర్వహించిన మాయా ఖుబానీ 13వ వార్షిక ఫొటోగ్రఫీ పోటీల్లో హైదరాబాద్ కు చెందిన ముకేశ్ శర్మకు ఫస్ట్ ప్రైజ్ దక్కింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా 115 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొని స్ట్రీట్, వైల్డ్లైఫ్, ఫ్యాషన్, ల్యాండ్స్కేప్, పోర్ట్రెయిట్, మొబైల్ ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో 134 ఫొటోలను ప్రదర్శించారు.
ఇందులో నగరానికి చెందిన ముకేశ్ శర్మకు మొదటి బహుమతి, ముంబైకి చెందిన బివేకానంద పత్రకు సెకండ్గెలుచుకున్నారు. కార్యక్రమంలో జేపీసీ ఫౌండర్ అనిల్ ఖుబానీ, ఐఐహెచ్ఎంఆర్ డైరెక్టర్ డా. లలిత్యా గుప్తా, అభినవ్ మిశ్రా, పవన్అగర్వాల్, సత్యప్రకాశ్భారతి, ఖుషీరామ్ చౌదరి పాల్గొన్నారు.

