అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ.. ముసుగేసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు..

 అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ.. ముసుగేసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు..

ములుగు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా అడిషనల్ కలెక్టర్ ఇంట్లోనే చోరీ చేశారు. ముసుగేసుకుని ఇంట్లోకి పోతున్నప్పుడు కెమెరాకు చిక్కిన అగంతకులు. ఈ ఘటన ఏటూరు నాగారంలోని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో 2024 మార్చి 18 సోమవారం రాత్రి జరిగింది. దీనిపై అడిషనల్ కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రిపూట తన ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ ఇంట్లో సీసీ ఫుటేజీకి సంబంధించిన దృష్యాలను పరిశీలిస్తున్నారు. చోరికి సంబంధించిన పూర్తి వివరాలు, విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు సీఐ రాజు, ఎస్సై కృష్ణ ప్రసాద్. అయితే వీరు స్థానికులా? ఇతర ప్రాంతాలకు చెందిన వారా..? నిజంగా చోరీ చేయడానికే వచ్చారా లేక వారి ఉద్దేశ్యం ఇంకేమైన ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.