లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు అందజేత

లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు అందజేత

ములుగు, వెలుగు : లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటామని ములుగు ఎస్పీ శబరీశ్‌‌ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గుపాడుకు చెందిన మావోయిస్టు సెక్షన్‌‌ కమాండర్‌‌ నూప భీమ అలియాస్‌‌ సంజు, అతడి భార్య ముచకి దుల్దో అలియాస్​ సోని ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దీంతో వారిపై ఉన్న రివార్డును అందజేసిన అనంతరం ఎస్పీ మాట్లాడారు.

ప్రజాస్వామ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబంతో జీవించాలని కోరారు. కార్యక్రమంలో ఓఎస్డీ అశోక్‌‌కుమార్‌‌, డీఎస్పీ రవీందర్‌‌ పాల్గొన్నారు.