డ్రగ్స్ కేసులో ముగిసిన ముమైత్ ఖాన్ విచారణ

డ్రగ్స్ కేసులో ముగిసిన  ముమైత్ ఖాన్ విచారణ

డ్రగ్స్ కేసులో ఇవాళ నటి ముమైత్ ఖాన్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటలు పాటు ముమైత్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. బ్యాంక్ లావాదేవీలు, కెల్విన్ తో ఉన్న సంబంధాలు, ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీలపై ఎంక్వైరీ చేశారు.  అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు ఈడీ అధికారులు. ఇప్పటికే పూరిజగన్నాథ్, నవదీప్,రకూల్, రవితేజ, చార్మి, రానా, నందులను విచారించింది ఈడీ.