ముంబై: కరోనా ఎఫెక్టుతో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 55 ఏండ్ల వయసు పైబడిన పోలీసులు ఎవరూ డ్యూటీలకు రావొద్దంటూ ఆఫీసర్లు ఆదేశాలిచ్చారు. వారంతా ఇండ్లలోనే ఉండాలని సూచించారు. ముంబై సిటీలో కరోనా బారిన పడి ముగ్గురు పోలీసులు చనిపోయిన తర్వాత పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ముంబై సిటీలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో 55 ఏళ్ల వయసు దాటిన పోలీసులు విధుల్లో ఉండరు. వాళ్లందరినీ ఇళ్లకే పరిమితం కావాలని సూచించాం” అని ముంబై పోలీస్ చీఫ్ పరమ్ వీర్ సింగ్ పేర్కొన్నారు. గడిచిన మూడ్రోజుల వ్యవధిలోనే 50 ఏళ్ల వయసు పైబడిన ముగ్గురు పోలీసులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 55 ఏళ్లు దాటిన వారు త్వరగా వైరస్ బారిన పడే చాన్స్ ఉందన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
55 ఏండ్లు దాటిన పోలీసులు డ్యూటీకి రావొద్దు
- దేశం
- April 28, 2020
లేటెస్ట్
- దీపాన్షుకు గోల్డ్
- రాష్ట్రానికి పైసా పని చేయని.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్
- లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత
- బీఆర్ఎస్ పని ఖతమైంది : లక్ష్మణ్
- సీన్లోకి మన్నె.. ఆసక్తికరంగా పాలమూరు రాజకీయం
- సైబర్ సెక్యూరిటీపై అసోచామ్ కాన్ఫరెన్స్
- గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు
- గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.!
- మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్
- ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది: మోదీ
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు