పూనమ్ను వదిలేదే లేదు.. తీవ్రంగా స్పందించిన ముంబై న్యాయవాది

పూనమ్ను వదిలేదే లేదు.. తీవ్రంగా స్పందించిన ముంబై న్యాయవాది

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే(Poonam Pandey) ఇటీవల చేసిన కాంట్రవర్సీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె చనిపోయిందంటూ ఫేక్ న్యూస్ ను వైరల్ చేసి.. తీరా క్యాన్సర్ అవాగాహన కోసమే అలా చేశామంటూ వీడియో రిలీజ్ చేసింది పూనమ్. దీంతో దేశమంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజానికి ఆమె మరణవార్త విని చాలా మంది ఎమోషనల్గా ఫీలయ్యారు. చిన్నవయసులోనే అలా జరగడం బాధాకరం అంటూ ప్రముఖులు సైతం సైతం శ్రద్ధాంజలి ఘటించారు.

ఇక తాను చనిపోలేదు అంటూ, కేవలం సర్వైకల్ క్యాన్సర్ కోసం అలా చేశాను అంటూ పూనమ్ విడుదల చేసిన వీడియోతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది.. పూనమ్ మరియు ఆమె మేనేజర్‌ పై కేసు నమోదు చేశారు. మీడియాను, జనాలను తప్పుదోవ పట్టించేలా పూనమ్ మరియు ఆమె మేనేజర్ నికితా శర్మ ప్రవర్తించారంటూ ఆరోపించారు. ఫేక్ మరణ వార్తను మీడియా ప్రచారం చేసేలా చేయడం అనేది అసత్యాలు ప్రచారం చేసినట్లు అవుతుందని, కాబట్టి వారిపై కేసు పెట్టాల్సిందే అని, పూనమ్ కు శిక్ష పడే వరకు వదిలేది లేదు.. అని మండిపడుతున్నారు  ఆ న్యాయవాది. మరి ఈ విషయంలో ముంబై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.