ముంబయి మేయర్ కిశోరి ఫడ్నేకర్ కన్నుమూత

ముంబయి మేయర్ కిశోరి ఫడ్నేకర్ కన్నుమూత

ముంబయి: దేశ ఆర్ధిక రాజధాని ముంబై మహానగర ప్రధమ పౌరురాలు, మేయర్ కిశోరి ఫడ్నేకర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స ఫలించక కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. శివసేన పార్టీకి చెందిన ఈమె గతంలో రెండుసార్లు ముంబయి మహానగర ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలుపొందారు. పార్టీకి విధేయురాలిగా ఉంటూ ప్రజల్లోకి చొచ్చుకువెళ్లే అలవాటుతో చురుకైన లీడర్ గా ఎదిగారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం దృష్టిలో పడి మూడో పర్యాయంలో కార్పొరేటర్ గా గెలిచిన వెంటనే మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు.