గాలి పటం మాంజా.. ఆ కానిస్టేబుల్ గొంతు కోసేసింది.

గాలి పటం మాంజా.. ఆ కానిస్టేబుల్ గొంతు కోసేసింది.

సంక్రాంతికి సరదగా ఎగురవేసే గాలిపటం ఓ  కానిస్టేబుల్  ప్రాణాలు తీసింది. ఆ ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గాలిపటం వల్ల  కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.   ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది.

అసలేం జరిగిందంటే.. దిండోషి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ సమీర్ జాదవ్ (37) డిసెంబర్ 24న  ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని వర్లిలోని  తన  ఇంటికి వెళ్తుండగా శాంతాక్రూజ్ ఈస్ట్‌లోని వకోలా వంతెన దగ్గర  గాలిపటం దారం అతని గొంతుకు చుట్టుకుంది.  దీంతో వెంటనే కిందపడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఖేర్వాడి పోలీసులు (బీట్ మార్షల్స్) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని సియోన్ ఆసుపత్రికి తరలించారు.

టెస్టులు చేసిన తర్వాత ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. స్థానికులు ఈ సంఘటనపై ఖేర్వాడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. బీట్ మార్షల్స్ వెంటనే వచ్చి జాదవ్‌ను ఆసుపత్రికి తరలించామన్నారు.. జాదవ్ భార్య హౌస్ వైఫ్, అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జాదవ్ బంధువులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.