ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్

ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్

మహబూబ్ నగర్ : మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గురువారం ఓ కాంట్రాక్టర్ దగ్గర రూ. 1.65 లక్షలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కాడు. ఓ పనికి సంబంధించి బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ నుంచి కమిషనర్ సురేందర్ రూ. 11 లక్షలు లంచం డిమాండ్ చేయగా.. రూ. 1.65 లక్షలు లంచంగా ఇస్తుండగా పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.