యాదాద్రిలో లొల్లి: ఇండిపెండెంట్ల కోసం కొట్లాట

యాదాద్రిలో లొల్లి: ఇండిపెండెంట్ల కోసం కొట్లాట

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హంగ్ పరిస్థితి నెలకొనడంతో ఇండిపెండెంట్ల కోసం లొల్లికి దిగాయి రెండు ప్రధాన పార్టీల నేతలు. టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో నాలుగు సీట్లు గెలుచుకోవటంతో.. స్వతంత్ర అభ్యర్థుల కోసం రెండు పార్టీల నేతలు గొడవకు దిగారు. స్వతంత్ర అభ్యర్థిని క్యాంపుకు తరలించేందుకు పోటీ పడ్డారు. తమతో రావాలంటే తమతో రావాలని వాదనలకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ సెంటర్ దగ్గర లొల్లి అవుతుండటంతో కాంగ్రెస్ నేతలను బయటకు పంపించారు పోలీసులు.