టీఆర్ఎస్ లీడర్ల అండతోనే ఫ్లెక్సీలు తొలగించారు

టీఆర్ఎస్ లీడర్ల అండతోనే ఫ్లెక్సీలు తొలగించారు

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సోమవారం మున్సిపల్​​సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించిన ఏరియాలను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్ల అండదండలతోనే ఫ్లెక్సీలు తొలగించారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు పండగ శుభాకాంక్షలు చెప్పే హక్కులేదా అని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సమాచారం లేదు..
ఫ్లెక్సీలు తొలగింపుపై ఎలాంటి సమాచారం లేదు. ఎందుకు తొలగించారో వివరాలు సేకరిస్తున్నాం. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని మున్సిపల్ శానిటేషన్​సిబ్బందిని ఆదేశించాం.
-ఆకుల వెంకటేశ్, మున్సిపల్ ఇన్​చార్జి కమిషనర్​