మున్నూరు కాపు ఫైనాన్స్​ కార్పొరేషన్​ పెట్టాలి

మున్నూరు కాపు ఫైనాన్స్​ కార్పొరేషన్​ పెట్టాలి
  • రూ. 5వేల కోట్ల నిధులు మంజూరు చేయాలె 
  • తెలంగాణ మున్నూరు కాపు సంఘం  

ఖైరతాబాద్​,వెలుగు: కాంగ్రెస్​ఎన్నికల మేనిఫెస్టోలో మున్నూరు కాపు ఫైనాన్స్​కార్పొరేషన్​ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిందని, పార్లమెంటు ఎన్నికలలోపు అమలు చేయాలని   రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర  అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్, మున్నూరు కాపు డెవలప్​మెంట్​ఫోరం అధ్యక్షుడు ఎడ్ల రవికుమార్, మున్నూరు కాపు యువత అధ్యక్షుడు బండి సంజీవ్​పటేల్​మాట్లాడారు.

పదేండ్లుగా మున్నూరు కాపు ఫైనాన్స్​కార్పొరేషన్​ఏర్పాటుకు  ఉద్యమించినా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం హామీ మేరకు ఫైనాన్స్​కార్పొరేషన్​ఏర్పాటుతో పాటు రూ. 5 వేల కోట్ల నిధులు కేటాయించి,  సంఘానికి 2 ఎకరాల స్థలం ఇవ్వాలని, 33 జిల్లాల్లోని మున్నూరు కాపు విద్యార్థులకు హాస్టళ్లను మంజూరు చేయాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేళ్ల హరికృష్ణ, రాష్ట్ర కన్వీనర్​చింతపండు మహేందర్​పటేల్, వనమాల ప్రవీణ్​పటేల్, గ్రేటర్​హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్వీ మహేందర్​తదితరులు పాల్గొన్నారు.