మునుగోడు బైపోల్ కోసం బీజేపీ స్టీరింగ్ కమిటీ 

మునుగోడు బైపోల్ కోసం బీజేపీ స్టీరింగ్ కమిటీ 

మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బై పోల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ  మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామిని ఆ కమిటీ  ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్టీరింగ్ కమిటీలో మరో 14 మంది సభ్యులుగా వ్యవహరించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ కో ఆర్డినేటర్గా నియమించారు.

స్టీరింగ్ కమిటీ సభ్యులు

  • ఈటల రాజేందర్, ఎమ్మెల్యే
  • జితేందర్ రెడ్డి, మాజీఎంపీ
  • గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ
  • విజయ శాంతి, మాజీ ఎంపీ
  • దుగ్యాల ప్రదీప్ కుమార్, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ
  • స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ
  • చంద్ర శేఖర్, మాజీ మంత్రి
  • ఎండ్ల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే
  • రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ
  • రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎంపీ
  • యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
  • కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ
  • టి. ఆచారి, నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
  • దాసోజు శ్రవణ్