- కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల తీర్పు రెండు పార్టీలకు బుద్ధి చెబుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడుకు హస్తం నేతలు, శ్రేణులు కదిలిరావాలని పిలుపునిచ్చిన ఆయన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం సీరియస్గా పనిచేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలకు ఏమి చేయలేదని, ట్రైబల్ యూనివర్సిటీ ఏమైంది ? అని ప్రశ్నించారు. ఆంధ్రలో ట్రైబల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. కానీ తెలంగాణాలో మాత్రం కాలేదన్నారు. అలాగే ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ గురించి ఊసే లేదన్నారు. ఇతర రాష్ట్రాల సీఎం లు, కేంద్రమంత్రులు వచ్చినా కూడా తెలంగాణకు బీజేపీ చేసింది చెప్పడం లేదన్నారు.
8 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేసిండు
‘‘రాష్ట్రంలో కేసీఆర్ గలీజ్ రాజకీయాలు చేసిండు.. సర్పంచ్ నుండి కేసీఆర్ వరకు అందరూ ఆగం చేసిండ్రు.. ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారా ? అని కేసీఆర్ వారిని అవమాన పరిచిండు.. అయినా టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులు మద్దతివ్వడం బాధాకరం’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.