మునుగోడు బై పోల్ 11వ రౌండ్ ఫలితం

మునుగోడు బై పోల్ 11వ రౌండ్ ఫలితం

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రతి రౌండ్‭లోనూ టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. రెండు, మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ముందంజలో ఉంది.  టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 

పదకొండో రౌండ్ లో..

మునుగోడు బైపోల్ 11వ రౌండ్ లో కూడా కారు పార్టీ  ఆధిక్యంలో నిలిచింది. టీఆర్ఎస్ కు 7,214 ఓట్లు పోలవ్వగా..బీజేపీకి 5,754  ఓట్లు వచ్చాయి. 11  రౌండ్లు ముగిసే సమయానికి మొత్తంగా టీఆర్ఎస్ కు  5,704  ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక తదుపరిగా 12,13 రౌండల్లో మర్రిగూడ మండలం, 14,15 రౌండ్లలో నాంపల్లి మండల ఓట్లను లెక్కించనున్నారు.  అంతకుముందు పదో రౌండ్ లో కూడా కారు పార్టీ ఆధిక్యంలో నిలిచింది. ఆ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,503 ఓట్లు పోలవ్వగా..బీజేపీకి 7,017 ఓట్లు వచ్చాయి.