12వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ

12వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ

మునుగోడు ఉపఎన్నిక ఫలితాల్లో కారు పార్టీకి కమలం గట్టిపోటీ ఇచ్చింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడిచింది.  ప్రతి రౌండ్‭లోనూ టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. రెండు, మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ముందంజలో ఉంది.  టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇక మిగిలింది 13,14,15 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. 

మునుగోడు బైపోల్ 12వ రౌండ్ లో అధికార టీఆర్ఎస్ ముందంజలో నిలిచింది. టీఆర్ఎస్ కు7,440 ఓట్లు పోలవ్వగా..బీజేపీకి 5,398  ఓట్లు వచ్చాయి. 12  రౌండ్లు ముగిసే సమయానికి మొత్తంగా టీఆర్ఎస్ కు  7,836 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక తదుపరి 13వ రౌండ్  మర్రిగూడ మండలం, 14,15 రౌండ్లలో నాంపల్లి మండల ఓట్లను లెక్కించనున్నారు.