మునుగోడు బై పోల్ తొమ్మిదో రౌండ్ ఫలితం

మునుగోడు  బై పోల్ తొమ్మిదో రౌండ్ ఫలితం

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రతి రౌండ్‭లోనూ టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. రెండు, మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ముందంజలో ఉంది. స్వల్ప ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 

తొమ్మిదో రౌండ్ 

మునుగోడు బై పోల్ తొమ్మిదో రౌండ్ ఫలితాల్లోనూ టీఆర్ఎస్ ముందంజలో నిలిచింది. ఇందులో టీఆర్ఎస్ కు 7,234  ఓట్లు, బీజేపీకి 6506 ఓట్లు వచ్చాయి.9 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి మొత్తంగా టీఆర్ఎస్ 3,757 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.  ఇక తదుపరిగా 10,11 రౌండ్లలో గట్టుప్పల్ మండలం, 11,12,13 రౌండల్లో మర్రిగూడ మండలం, 13,14,15 రౌండ్లలో నాంపల్లి మండల ఓట్లను లెక్కించనున్నారు. 


ఎనిమిదో రౌండ్ 

అంతకుముందు ఎనిమిదో రౌండ్‭లోనూ టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఎనిమిదో రౌండ్‭లో టీఆర్ఎస్‭కు 6,520 ఓట్లు రాగా.. బీజేపీకి 6,188 ఓట్లు పోల్ అయ్యాయి. ఎనిమిదో రౌండ్ ముగిసే సమయానికి 2,900లకు పైగా ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఎనిమిదో రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్‭కు 52,243 ఓట్లు రాగా.. బీజేపీకి 49,339 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్‭కు 13,689 ఓట్లు వచ్చాయి.