మూసీలో కొట్టుకుచ్చిన మహిళ మృతదేహం.. మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర డెడ్ బాడీ

మూసీలో కొట్టుకుచ్చిన మహిళ మృతదేహం.. మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర డెడ్ బాడీ

హైదరాబాద్ మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మూసీలో ఓ డెడ్ బాడీ కొట్టుకువచ్చింది. జేసీబీ సాయంతో చెత్తను తొలగిస్తుండగా.... మృతదేహాన్ని గుర్తించారు బల్దియా సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. మృతదేహాన్ని కవాడిగూడకు చెందిన లక్ష్మీగా గుర్తించారు. 

రెండు రోజుల క్రితం మూసీలో లక్ష్మీ గల్లంతైంది. మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర డెడ్ బాడీ కూడా మహిళదే కావడంతో.... లక్ష్మీయేననే అనుమానాలు వ్యక్తమవుతున్నారు. కవాడిగూడకు మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కవాడిగూడ మిస్సైన లక్ష్మీ కుటుంబ సభ్యులు మూసారాంబాగ్ చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు.