ఓట్లకోసమే ఓబీసీ లిస్టులోకి ముస్లింలు

ఓట్లకోసమే ఓబీసీ లిస్టులోకి ముస్లింలు

బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ . TRS తోపాటు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్  విధానాలకు లొంగిపోయి.. బీసీలకు అన్యాయం చేశాయన్నారు.  ఈనెల 16 నుంచి 21 వరకు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రుల ఆశీర్వాద యాత్రలు జరుగుతాయన్నారు. ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆశీర్వాద యాత్ర ఉంటుందన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలను ఓబీసీ జాబితాల్లో చేర్చుతున్నారన్నారు.  బీసీల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వాలపై ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.