అందరం కలిసి హార్ముజ్ ను తెరిపిద్దాం.. యుద్దనౌకలను పంపించండి..మిత్ర దేశాలకు ట్రంప్ పిలుపు

అందరం కలిసి  హార్ముజ్ ను తెరిపిద్దాం.. యుద్దనౌకలను పంపించండి..మిత్ర దేశాలకు ట్రంప్ పిలుపు

హార్ముజ్​ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ యుద్ద నౌకలను పంపించాలని డొనాల్డ్​ ట్రంప్​ ప్రపంచ దేశాలను కోరారు. హార్ముజ్​ జలసంధి ద్వారా చమురును స్వీకరించే ప్రపంచ దేశాలు ఆ మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హార్ముజ్​ మూసివేతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న  దేశాలన్నీ తమ యుద్ద నౌకలను ఆ ప్రాంతానికి పంపించాలని, అమెరికా వారికి సాయంగా ఉంటుందన్నారు ట్రంప్. 

శనివారం ట్రంప్​ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్​ద్వారా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. “హార్ముజ్​ జలసంధి ద్వారా చమురును స్వీకరించే ప్రపంచ దేశాలు ఆ మార్గాన్ని  సురక్షితంగా చూసుకోవాలి. మేం సాయం చేస్తాం అని ట్రూత్​ సోషల్ రాశారు ట్రంప్​. 

ప్రపంచ దేశాలను అమెరికా సమన్వయం చేస్తోంది..  త్వరలో హార్ముజ్​ ను తెరుచుకుంటుందన్నారు. ప్రపంచ దేశాలకు  ఐదో వంతు చమురు, గ్యాస్ రవాణా హార్ముజ్​ నుంచే   జరుగుతుంది.ఇరాన్​, ఒమన్​ మధ్య ఇరుకైన జలమార్గం ఇది. ఈ ఛానల్​ద్వారా ఇరాన్ నౌకయానాన్ని అడ్డుకుంటోందన్నారు ట్రంప్.  

ఇరాన్​ హార్ముజ్​ ను మూవేయడంతో ప్రభావితమైన దేశాలు జలసంధిని తెరిచి, నౌకల ప్రయాణం సురక్షితం చేయడానికి యుద్ద నౌకలను పంపుతాయి.. చైనా, ఫ్రాన్స్​, జపాన్​, దక్షిణ కొరియా, బ్రిటన్​ , కూడా ఈ ప్రాంతానికి నౌకలను పంపుతారని ఆశిస్తున్నానని ట్రంప్​ పోస్ట్ లో రాశారు. తీరప్రాంతంలో అమెరికా బాంబుల దాడులు చేస్తూనే ఉంటుంది, ఇరానియన్​పడవలు, ఓడలను నీటిలో ముంచివేస్తూనే ఉందని ట్రంప్​ రాశారు.