నా కబ్జాలు నిరూపిస్తే.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ముత్తిరెడ్డి

నా కబ్జాలు నిరూపిస్తే..  ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ముత్తిరెడ్డి

జనగామ నియోజకవర్గంలో తాను ఏక్కడ కబ్జాలు చేశానో  నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని సవాల్ విసిరారు  బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.  ప్రజల సాక్షిగా, సీఎం కేసీఆర్ సైనికుడిగా తన కబ్జాలను నిరూపించాలన్నారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు సంచులతో స్థానిక నేతలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. వేరే పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన పల్లా.. భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  డబ్బుతో నియోజకవర్గ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తే మరో హుజూరాబాద్ గా మారుతుందని వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో లెర్నింగ్ లైసెన్స్ పంపిణీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.