పిల్లవాడికి శిక్షగా తమ క్లాస్మేట్ను కొట్టమని విద్యార్థులను కోరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు ఈరోజు క్లారిటీ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో త్రిప్తా త్యాగి అనే ఉపాధ్యాయురాలు తన చర్యలను సమర్థించింది. ఆమె శారీరక వికలాంగురాలు కాబట్టి ఆ చిన్నారిని వ్యక్తిగతంగా శిక్షించేందుకు తాను నిలబడలేకపోయానని టీచర్ చెప్పింది. అందుకే, పిల్లవాడిని కొట్టమని ఆమె తరగతిలోని ఇతర విద్యార్థులను కోరింది. ముజఫర్నగర్లోని నేహా పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
త్రిప్తా త్యాగి తన ప్రకటనలో వీడియో ఫేక్ అని, అది తన పరువు తీసేందుకే షేర్ చేశారని ఆరోపించింది. విద్యార్థినులు పిల్లవాడిని కొట్టమని చెప్పి నేను తప్పు చేశాను, నేను వికలాంగురాలిని. లేవలేను, అందుకే పిల్లవాడిని కొట్టమని విద్యార్థులను కోరాను. కానీ వీడియో మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చిన్నారిపై అమానవీయ చర్యలకు పాల్పడినట్టుగా వస్తోన్న ఆరోపణంలపై ఉపాధ్యాయురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) సైతం విమర్శలను ఎదుర్కొంటోంది.
"వైరల్ చేసిన వీడియో ఎడిట్ అండ్ కట్ చేయబడింది. నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు, స్కూల్లో హిందువులు, ముస్లింలు ఐక్యతతో ఉంటారు. మా పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నారు. నేను అంగవైకల్యంతో ఉన్నాను, నేను లేవలేను. అతను గత 2 నెలలుగా హోంవర్క్ చేయడం లేదు. అందుకే నేను ఈ పని చేశాను. పరీక్షలు దగ్గర పడుతున్నందున 'ముహమ్దాన్ తల్లిదండ్రులను తమ పిల్లవాడిని ఇళ్లకు తీసుకెళ్లకూడదని నేను చెప్పాను. కానీ వారు ఈ వీడియోను కట్ చేసి 'ముహమ్దాన్' పదాన్ని తీసుకున్నారు. నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. నేను తప్పు చేశాను. రెండు చేతులతో నమస్కరించి క్షమాపణలు చెప్తున్నా" అని ఆ టీచర్ చెప్పుకొచ్చింది.
చట్టం తన పని తాను చేస్తుందని, న్యాయం జరగాలని స్కూల్లో దెబ్బలు తిన్న చిన్నారి తండ్రి విజ్ఞప్తి చేశారు. ఏదో పని నిమిత్తం పాఠశాలకు వెళ్లిన తన మేనల్లుడు ఈ వీడియోను చిత్రీకరించాడని చెప్పాడు. "నా కొడుకుకు ఏడేళ్లు. ఈ సంఘటన ఆగస్టు 24న జరిగింది. ఉపాధ్యాయురాలు నా బిడ్డను మళ్లీ మళ్లీ కొట్టేలా చేసింది. మా మేనల్లుడు అప్పుడే ఏదో పని మీద పాఠశాలకు వెళ్లగా.. అక్కడ ఈ ఘటన చూసి వీడియో తీశాడు. నా ఏడేళ్ల -వయసు బిడ్డను దాదాపు రెండు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. అతను భయపడుతున్నాడు. ఇది హిందూ-ముస్లింల విషయం కాదు. చట్టం ప్రకారం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం" అని విద్యార్థి తండ్రి చెప్పాడు.
దీని కంటే ముందు ఓ మైనారిటీ విద్యార్థిని.. అంగవైకల్యంతో ఉన్న టీచర్.... అతను చదవలేదన్న కారణంతో తరగతిలోని ఇతర విద్యార్థులను ఆదేశించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోలో పిల్లలు విద్యార్థిని ముఖం, వీపుపై కొట్టడం మరియు కొట్టడం చూడవచ్చు. ఘటనకు సంబంధించి అధికారులు విచారణకు ఆదేశించారు. పిల్లవాడిని కొట్టమని ఇతర విద్యార్థులను కోరడం ద్వారా తాను తప్పు చేశానని టీచర్ సైతం తన వాంగ్మూలంలో అంగీకరించింది.
#WATCH | UP: "My son is seven years old. This incident happened on 24th August. The teacher made the students beat my child again & again. My nephew made the video and had gone to school for some work...My seven-year-old child was tortured for an hour or two. He is scared...This… https://t.co/qQ7FaiPbza pic.twitter.com/zEelhTdK6G
— ANI (@ANI) August 26, 2023