కత్తులతో పొడిచి ఇద్దరి హత్య ... సిటీలో వేర్వేరు చోట్ల ఘటనలు

కత్తులతో పొడిచి ఇద్దరి హత్య ... సిటీలో వేర్వేరు చోట్ల ఘటనలు

నాచారం, వెలుగు: నాచారంలో సెంట్రింగ్​ వర్కర్​ దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లెలగూడ మీర్​పేట  ప్రాంతానికి చెందిన కొయ్యడ మురళీకృష్ణ(45) సెంట్రింగ్​ వర్క్​ చేస్తుంటాడు. ఏడాది క్రితం నుంచి ఉప్పల్​ కల్యాణపురిలో భార్య తులసీరత్నంతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం మీర్​పేటలో ఉండే తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను ఓ కారులో నాచారం పారిశ్రామిక వాడ తెలంగాణ ఫుడ్స్​ ఇండస్ట్రీ సమీపానికి తీసుకొచ్చారు. కత్తులతో పొడిచి హత్య చేసి పారిపోయారు. పోలీసులు డెడ్​బాడీని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బాలానగర్​లో మరో ఘటన..

కూకట్​పల్లి : బాలానగర్​ పోలీసుస్టేషన్​ పరిధిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నగరంలోని లాలాగూడకు చెందిన గఫార్​(39) సెటిల్​మెంట్లు చేస్తుంటాడు. ఇతనికి బాలానగర్​కు చెందిన కొందరితో పరిచయం ఏర్పడింది. సెటిల్​మెంట్స్​ వ్యవహారాల్లో వారితో విభేదాలు ఏర్పడ్డాయి. సోమవారం మధ్యాహ్నం ఆయన ఐడీపీఎల్​ బస్టాప్​ సమీపంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో గఫార్​ స్పాట్​లో మృతిచెందాడు.