Naa Saami Ranga Trailer: ఈ సారి పండక్కి నా సామిరంగ..ఇక మాస్ జాతరే

Naa Saami Ranga Trailer: ఈ సారి పండక్కి నా సామిరంగ..ఇక మాస్ జాతరే

నాగార్జున నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’ (Naa Saamiranga). ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. సంక్రాంతి పండుగకు సరిగ్గా సూటయ్యే చిత్రం ఇదే అంటూ మేకర్స్ ప్రమోషన్లతో అట్ట్రాక్ట్ చేస్తోంది.

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఈ సినిమా కథ సాగుతుంది. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ యాక్టింగ్, బిజీఎం, డైలాగ్స్, హీరోయిన్స్ అచ్చమైన తెలుగు సొగసు అందాలు..ట్రైలర్ లో స్పెషల్ గా నిలిచాయి. 

ఇక ట్రైలర్ స్టార్ట్ అవుతునే ..'కిష్టయ్య ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు..అంటూ అల్లరి నరేశ్ వాయిస్ ఓవర్‌తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. గోదావరి యాసలో నరేశ్ డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 'కిట్టయ్యకు నరకడమే తెలుస్తది కానీ..సరసం ఎట్ట తెలుస్తది' అంటూ రాజ్ తరణ్ చెప్పే డైలాగ్ బాగుంది. ఇక ట్రైలర్ చివర్లో..అన్నట్టు మరిచిపోయాను..మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు'..ఈ సారి పండక్కి నా సామిరంగ..ఇక మాస్ జాతరే..అంటూ నాగ్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో అదిరిపోయింది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నాగ్‍కు జోడీగా అషిక రంగనాథ్, అల్లరి నరేశ్‍ సరసన మిర్నా మోహన్, రాజ్ తరుణ్‍ జోడీగా రిక్సార్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు.

ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.