నల్లగొండ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

నల్లగొండ జిల్లాలో మరోసారి కరోనా కలకలం
  • గురుకులంలో కరోనా..15 మందికి హోం క్వారెంటైన్

నల్లగొండ జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. నార్కట్ పల్లిలోని మహాత్మ జ్యోతిరావుపూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థులను హోం క్వారంటైన్ కి తరలించారు. విద్యార్థులందరికీ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయని వైద్యులు తెలిపారు. 
నార్కట్ పల్లి గురుకుల పాఠశాలను జిల్లా వైద్య  ఆరోగ్యశాఖ అధికారి కొండల్ రావు సందర్శించారు.

కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ కొండలరావు సూచించారు. నిన్న కొండమల్లేపల్లి గురుకుల పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మరుసటి రోజే నార్కట్ పల్లి గురుకుల పాఠశాలలో కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యార్థులందర్నీ క్వారంటైన్ లో ఉంచి...శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.