TSPSC లీకేజీ కేసు : 12 మంది నిందితులకు రిమాండ్ 

TSPSC లీకేజీ కేసు : 12 మంది నిందితులకు రిమాండ్ 

TSPSC లీకేజీ కేసులో 12 మంది నిందితులకు నాంపల్లి కోర్టు కోర్టు రిమాండ్ విధించింది.  అనంతరం వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే లీకేజీ కేసులో ఆరెస్ట్ అయిన 9 మందిని పోలీసులు కస్డిడికి తీసుకుని విచారించారు. మరోవైపు TSPSC లో పనిచేస్తున్న రమేష్, సురేష్, షమీమ్ లను ఇవాళ పోలీసులు ఆరెస్ట్ చేశారు. వారిని కూడా కోర్టు ముందు హాజురు పరచడంతో 9 మందికి  మార్చి 28 వరకు, కొత్తగా ఆరెస్టైన ముగ్గురికి ఏప్రిల్ 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

TSPSC లీకేజీ కేసులో  ఆరెస్టైన రమేష్,  షమీమ్, సురేష్ లు  సైతం గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి 100కి పైగా మార్కులు పొందినట్లు విచారణలో గుర్తించారు సిట్ అధికారులు.  పేపర్ లీకేజ్ ద్వారానే ఈ ముగ్గురు ఎగ్జామ్ రాశారని పోలీసులు చెబుతున్నారు. TSPSCలో పనిచేసే 26 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయగా.. వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారని గుర్తించారు. TSPSCలో పని చేస్తున్న 30 మందికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమానితులందరినీ విచారించి.. వారి పాత్రపైనా ఆరా తీయనున్నారు.