గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్

గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్

ప్రధాని మోడీకి నానావతి కమిషన్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 2002 గుజరాత్‌లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కొందరు దుండగులు నిప్పంటించడంతో ఎంతో మంది మృతి చెందారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో హిందువుల కంటే ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. దీనిపై  నేటి ప్రధాని, అప్పటి గుజరాత్‌ సీఎం గా ఉన్న మోడీ ఈ అల్లర్లపై విచారణకు 2002లో కమిషన్‌ను వేశారు. మూడు రోజులపాటు సాగిన హింసను పోలీసులు ఏ మాత్రం అరికట్టలేక పోయారని కమిషన్‌ తెలిపింది. ఆ పోలీసు అధికారులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఈ ఘటనతో అప్పటి రాష్ట్ర మంత్రులెవరికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. నానావతి కమిషన్‌ రిపోర్టును  ఇవాళ(బుధవారం)  గుజరాత్‌ అసెంబ్లీ టేబుల్‌పై ఉంచారు. ఐదేళ్ల క్రితం కూడా రిటైర్డ్‌ జస్టిస్‌లు నానావతి, అక్షయ్ మోహతాలు ఈ ఘటనకు సంబంధించిన తుది నివేదికను అప్పటి ఆనందిబెన్‌ ప్రభుత్వానికి సమర్పించింది. తాజా నివేదిక ప్రకారం ప్రధాని మోడీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది నానావతి కమిషన్‌.