ప్రధాని మోడీకి నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. 2002 గుజరాత్లో గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలుకు కొందరు దుండగులు నిప్పంటించడంతో ఎంతో మంది మృతి చెందారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో హిందువుల కంటే ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. దీనిపై నేటి ప్రధాని, అప్పటి గుజరాత్ సీఎం గా ఉన్న మోడీ ఈ అల్లర్లపై విచారణకు 2002లో కమిషన్ను వేశారు. మూడు రోజులపాటు సాగిన హింసను పోలీసులు ఏ మాత్రం అరికట్టలేక పోయారని కమిషన్ తెలిపింది. ఆ పోలీసు అధికారులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఈ ఘటనతో అప్పటి రాష్ట్ర మంత్రులెవరికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. నానావతి కమిషన్ రిపోర్టును ఇవాళ(బుధవారం) గుజరాత్ అసెంబ్లీ టేబుల్పై ఉంచారు. ఐదేళ్ల క్రితం కూడా రిటైర్డ్ జస్టిస్లు నానావతి, అక్షయ్ మోహతాలు ఈ ఘటనకు సంబంధించిన తుది నివేదికను అప్పటి ఆనందిబెన్ ప్రభుత్వానికి సమర్పించింది. తాజా నివేదిక ప్రకారం ప్రధాని మోడీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది నానావతి కమిషన్.