పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం : నందీశ్వర్ గౌడ్

పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం : నందీశ్వర్ గౌడ్

సంగారెడ్డి, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు, ములుగు జిల్లా కేంద్రంగా ఆదివాసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆమోదం తెలపడంపై పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నిజామాబాద్ రూరల్ ఇన్ చార్జ్ నందీశ్వర్ గౌడ్ హర్షం ప్రకటించారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత రైతులు, ఆదివాసీలను గౌరవిస్తూ ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఈ ప్రాంత ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నాయకత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైందన్నారు. అందుకు ఆయన ప్రధానమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.