అద్దెకు దిగిన వారే.. హత్య చేశారు

అద్దెకు దిగిన వారే.. హత్య చేశారు

రంగారెడ్డి జిల్లా నందిగామ లో వృద్ధురాలు, బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామకు కు చెందిన పార్వతమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో కొన్ని రోజుల క్రితం దివాకర్, అంజలి దంపతులు అద్దెకు దిగారు. కొన్ని కారణాల వల్ల వారిని ఇళ్లు ఖాళీ చేయించారు. దీంతో పార్వతమ్మపై కక్ష పెంచుకున్న ఆ దంపతులు ఆమెను చంపడానికి నిర్ణయించుకున్నారు. 

రాత్రి వేళ పథకం ప్రకారం మాటుగాసి పార్వతమ్మతో పాటు ఆమెతో పాటు ఉంటున్న 9 ఏళ్ల బాలికను గొంతుకోసం హత్య చేశారు. అనంతరం బీరువాలోని డబ్బులు, బంగారాన్ని దొంగిలించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకున్నారు. దంపతులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా వారు చెప్పారు.  ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితులు దివాకర్,అంజలి బిహార్ కి చెందిన వారిగా గుర్తించారు. 

గ్రామస్థుల నిరసనలు..

నందిగామ లో వృద్ధురాలు, బాలిక ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు నిరసనలు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తా రోకో చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశారు.