అమరావతి: ఇటీవల ఒంగోలులో మైనర్ బాలికపై ఆరుగురు కామాంధులు పదిరోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా ఆరుగురిని ఒంగోలు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఘటనను మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విటర్లో ఖండించారు. ‘‘దేశంలోనే సంచలనం కలిగించిన ఈ దుశ్చర్యలో నిందితులు YCP కార్యకర్తలు కావడం సిగ్గు చేటు. జగన్ గారూ.. మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది’’ అని ట్వీట్ చేశారు.
ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు. @ysjagan గారూ, మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది. pic.twitter.com/MhXo6gQQ3Q
— Lokesh Nara (@naralokesh) June 25, 2019