జగన్ పాలనలో రాష్ట్రం సేఫ్ గా లేదు : లోకేశ్

జగన్ పాలనలో రాష్ట్రం సేఫ్ గా లేదు : లోకేశ్

అమరావతి: ఇటీవల ఒంగోలులో మైనర్‌ బాలికపై ఆరుగురు కామాంధులు పదిరోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా ఆరుగురిని ఒంగోలు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఘటనను మాజీ మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌లో ఖండించారు. ‘‘దేశంలోనే  సంచలనం కలిగించిన ఈ దుశ్చర్యలో నిందితులు YCP కార్యకర్తలు కావడం సిగ్గు చేటు. జగన్‌ గారూ.. మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది’’ అని ట్వీట్ చేశారు.