మీ బాబు తరమే కాలేదు.. మీ తరమూ కాదు

మీ బాబు తరమే కాలేదు.. మీ తరమూ కాదు

అమరావతి : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై, తన తండ్రి చంద్రబాబుపై అనవసరమైన ఆరోపణలు మానుకోవాలంటూ చురకలంటించారు. తన తండ్రిని ఎదుర్కోవడం మీ బాబు తరమే కాలేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ” జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారూ!  అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌!  మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు.  అవినీతి ముద్ర‌వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు. వంశ‌ధార‌పై మీరు వేసిన క‌మిటీ రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నివేదికిచ్చింది. పోల‌వ‌రంపై టీడీపీ హ‌యాంలో పంపిన  అంచ‌నాల‌న్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల…కల గానే మిగిలిపోతుంది” అని లోకేశ్ ట్విటర్ లో పేర్కొన్నారు.