దుర్గగుడిలో ఒకేసారి నరసింహన్, కేసీఆర్, జగన్ పూజలు

దుర్గగుడిలో ఒకేసారి నరసింహన్, కేసీఆర్, జగన్ పూజలు

ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార హడావుడి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రేపు ప్రజల మధ్య జగన్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు కీలకనాయకులు, సెలబ్రిటీలు హాజరు కానున్నారు.

రేపు జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ నరసింహన్ ఈ ఉదయం విజయవాడకు చేరుకున్నారు. బెజవాడలోని గేట్ వే హోటల్ లో గవర్నర్ బస చేస్తారు.

ఇవాళ సీఎం కేసీఆర్ కూడా బెజవాడ వెళ్తున్నారు. ఈ ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్న జగన్.. కడప జిల్లాలో పెద్దదర్గా, పులివెందులలో CSI చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం బెజవాడ చేరుకుంటారు.

సాయంత్రం బెజవాడ కనకదుర్గమ్మను గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉమ్మడిగా దర్శించుకోనున్నారు.