జేఈఈ అడ్వాన్స్డ్ విజేతలతో నారాయణ విజయోత్సవాలు

జేఈఈ అడ్వాన్స్డ్ విజేతలతో నారాయణ విజయోత్సవాలు

హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్ డ్–25లో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో నారాయణ ఐఐటీ అకాడమీ విజయోత్సవాలు నిర్వహించింది. సోమవారం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మక ఐఐటీ క్యాంపస్ లలో​అడ్మిషన్లు సాధించిన విద్యార్థులను నారాయణ యాజమాన్యం సన్మానించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప ఆయనతో చిట్ చాట్ నిర్వహించారు.

ఆయన అడిగిన ప్రశ్నలకు జేడీ లక్ష్మీనారాయణ సమాధానాలు ఇచ్చారు. అనంతరం నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ, శరణి నారాయణ మాట్లాడారు. విద్యార్థుల్లోని ప్రతిభను నిరంతరం మెరుగుపర్చడంతో పాటు  వారిని తమ లక్ష్యాలవైపు నడిపంచడం కోసం నారాయణ నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. విద్యార్థులు గొప్ప విజయాలు సాధించడానికి నారాయణ విద్యాసంస్థలు వేదిక కాబోతున్నాయని పేర్కొన్నారు.  రాబోయే విద్యాసంవత్సరంలో నారాయణ నుంచి ఐఐటీల్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా ముందుకు సాగుతామని వివరించారు.