
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను సెన్సార్ చేయకుండా ఆపడం అనైతికం అని అన్నారు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి. సెన్సార్ బోర్డ్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. నటి శ్రీదేవి ఆత్మకథ పుస్తకం విడుదల కార్యక్రమంలో నారాయణమూర్తి ఈ కామెంట్స్ చేశారు. “శ్రీదేవి కథ” పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను ఎందుకు సెన్సార్ చేయడం లేదని, దాని కోసం అమరావతి నుండి పర్మిషన్ కావాలా అని ప్రశ్నించారు నారాయణమూర్తి. దీనిపై సినిమా ఇండస్ట్రీ అంతా ఏకం కావాలన్నారు. సెన్సార్ బోర్డ్ శ్రీదేవి గారిని కూడా ఇబ్బంది పెట్టిందని గుర్తు చేసుకున్నారు. సెన్సార్ బోర్డ్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ తో పాటు నిర్మాత దిల్ రాజు , ఇతర ప్రముఖులు హాజరయ్యారు.