కొత్త ట్రైనింగ్ : గంజాయిని పట్టుకుంటున్న పోలీస్ కుక్కలు

కొత్త ట్రైనింగ్ : గంజాయిని పట్టుకుంటున్న పోలీస్ కుక్కలు

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడం పోలీసులకు సవాల్​ గా మారింది.   ప్రస్తుతం విశాఖపట్నం గంజాయి స్మగ్లింగ్​ కు అడ్డాగా మారింది.   తాజాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో నార్కోటిక్స్ శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లను ప్రవేశపెట్టారు. మొదటి రోజు 12 కిలోల గంజాయి రికవరీ చేసింది.

విశాఖ రైల్వేస్టేషన్​ లో   అధికారులు కొత్త నిఘా నేస్త్రాన్ని పెట్టారు.  అది అట్టాంటి.. ఇట్టాంటిది కాదండోయ్​ ఉద్యోగంలో జాయిన్​ అయిన రోజే గంజాయి స్మగ్లర్ల భరతం పట్టింది.    రైల్లో ఉన్న 12 కిలోల గంజాయిని పట్టుకొని అధికారులకు అప్పగించింది.  ఇంతకూ ఆ నిఘా నేస్త్రం ఏంటనుకుంటున్నారా... అదేనండి నార్కోటిక్స్​ లో శిక్షణ పొందిన స్నిఫర్​ డాగ్​.  

 మన భద్రత, రక్షణ తో పాటు నార్కోటిక్స్ శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లు మనలని పలకరిస్తాయి. తాజాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో నార్కోటిక్స్ శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లను ప్రవేశపెట్టారు. మొదటి రోజు 12 కిలోల గంజాయి రికవరీ చేసి తన ఆవశ్యకతను తెలియ చేసింది స్నిఫర్​ డాగ్​  విక్క్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, విశాఖ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సమన్వయ, సంయుక్త ప్రాజెక్ట్ ఇది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంలో ....  పట్టుకోవడంలో ఈ స్నిఫర్ డాగ్స్ కీలక పాత్ర పోషించనున్నాయి.


తొలిరోజే ట్రైన్ లో సరఫరా కు సిద్దంగా ఉన్న 12 కిలోల గంజాయి బ్యాగ్ లను గుర్తించిన స్నిఫర్ డాగ్ విక్కీ ఎప్పటినుంచో ఈ ప్రయోగాన్ని అమలు చేయాలని అనుకుంటూ ఉన్నా  డిసెంబర్ 2న తొలి ప్రయత్నం చేశారు.   విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నెం.6&7లో హెడ్ కానిస్టేబుల్ సఫీక్ మహ్మద్ & K.S.పాత్ర నేతృత్వంలో నార్కోటిక్స్ డాగ్ విక్కీ తనిఖీలు చేపట్టింది.

డిసెంబర్ 2న రాత్రి 8.55 గంటల సమయంలో ప్లాట్‌ఫారమ్ నెం.6లో రైలు నెం.08552 ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి సుమారు 06కిలోల గంజాయి కల మొత్తం 12కిలోలు ఉన్న రెండు బ్యాగ్ లను విక్కీ గుర్తించింది. గుర్తించిన వెంటనే రైల్వే రక్షక దళ ఇన్‌స్పెక్టర్ బృందం వెంటనే స్పందించింది. బ్యాగ్ యజమాని ఆచూకీ కోసం వెతికారు. అదే సమయంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని గేట్ నెం.05 సమీపంలో ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ విశాఖపట్నం అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా తాము గంజాయిని కొనుగోలు చేసి రైలు నెం.08552 ఎక్కి విశాఖపట్నం చేరుకున్నామని వెల్లడించారు. అయితే, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలో గుర్తించడం తో భయంతో ప్లాట్‌ఫారమ్‌ నెం.6లో రెండు బ్యాగులను వదిలి, ఒక బ్యాగ్‌తో గేట్‌ నెం.05 వైపు పారిపోతున్నట్టు తెలిపారు. ఆ సమయంలో టాస్క్ ఫోర్స్ కు పట్టుభడ్డట్టు వివరించారు. దీంతో ట్రైన్ లో రికవరీ చేసిన మొత్తం 12 కిలోల గంజాయి సంచులతో కలిపి నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం విశాఖపట్నం టాస్క్‌ఫోర్స్‌ అదుపులోకి తీసుకుంది.