
హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపాయి. సోమవారం ( జూన్ 23 ) టీ న్యాబ్, నార్సింగి పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. టీ న్యాబ్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన నార్సింగి పోలీసులు రూ. 30 లక్షల విలువజేసే ఎక్స్టసి పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఒక నైజీరియాన్ సహా ఇద్దరు లోకల్ పెడ్లర్స్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు మణికొండలోని ఓ లగ్జరీ ఫ్లాట్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ ముఠా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. విస్డం ఒనేకా, మణికొండ కి చెందిన గోపిశెట్టి రాజేష్, వెస్ట్ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న నైజీరియన్ నకిలీ పాస్ పోర్ట్ తో హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలిపారు పోలీసులు.
ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు పోలీసులు.మొయినాబాద్ పరిధి అజీజ్ నగర్ లోని ఫాం హౌజ్ లో మే 29న నిర్వహించిన రేవ్ పార్టీకి ఇదే ముఠా డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు పోలీసులు.మే 31న మంగళగిరి లో ఫణి రాజ్ అనే వ్యక్తికి 15 గ్రాముల కొకైన్ సరఫరా చేసారని.. ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొన్నవారిని గుర్తించామని తెలిపారు పోలీసులు.