సోనియా ఈడీ విచారణలో చిన్న మార్పు

 సోనియా ఈడీ విచారణలో చిన్న మార్పు

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణని ఈనెల 26వ తేదీకి మార్చారు అధికారులు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25వ తేదీన ప్రశ్నించాల్సింది ఉంది. కానీ, విచారణ తేదీని 25 నుంచి 26వ తేదీకి మార్చినట్లు తెలిపారు ఈడీ అధికారులు. వాయిదాకు కారణాలేమిటన్నది తెలపలేదు అధికారులు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆ పార్టీ నేతలను ఈడీ వరుసగా విచారిస్తోంది. 75 ఏళ్ల సోనియాను ఈనెల21న రెండు గంటలసేపు ప్రశ్నించారు అధికారులు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా కుటుంబంపై వేధింపులకు దిగుతోందని ఆరోపిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈడీ విచారణ అప్రజాస్వామికమంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.