హైదరాబాద్, వెలుగు : నీట్ పీజీ స్థానంలో తీసుకొచ్చిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్) అమలును వాయిదా వేస్తున్నామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గురువారం ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నెక్ట్స్ అమలును నిలిపివేస్తున్నామని తెలిపింది.
నీట్ పీజీ, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ), ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్కు బదులు నెక్స్ట్ పేరిట ఒకే పరీక్ష నిర్వహించాలని ఎన్ఎంసీ గతంలో నిర్ణయించింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్తో నెక్స్ట్ను ప్రారంభించాలని భావించారు. కానీ, స్టూడెంట్స్ వ్యతిరేకించడం, వారికి ఐఎంఐ సహా అన్ని సంస్థలు మద్దతు తెలపడంతో వాయిదా వేశారు.