- మాదిగ హక్కుల దండోరా
- బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు
ఖైరతాబాద్, వెలుగు : బీఆర్ఎస్, బీజేపీలు మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షుడు దండు సురేందర్ మాదిగ విమర్శించారు. బీజేపీ కపట ప్రేమను చూపిస్తూ 9 ఏళ్లుగా మాదిగలను మోసం చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పేందుకు తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతామని పేర్కొన్నారు. మత తత్వ పార్టీ బీజేపీకి ఎన్నికల సమయంలోనే మాదిగలు గుర్తుకు వస్తారని, ఎన్నికల అనంతరం తమ ఊసే ఉండదని విమర్శించారు. మదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగర శంకర్ మాదిగ మాట్లాడుతూ.. దళితుడిని సీఎంను చేస్తానని, 3 ఎకరాలు ఇస్తానని సీఎం కేసీఆర్చెప్పారన్నారు. కానీ ఇచ్చిన హామీలు ఆయన అమలు చేయలేదన్నారు.