అదానీ ఇష్యూపై దేశ వ్యాప్తంగా నిరసనలు

అదానీ ఇష్యూపై దేశ వ్యాప్తంగా నిరసనలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ ఇష్యూపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ముంబయిలోని చర్చి గేట్ రైల్వే స్టేషన్ వద్ద ఆప్ నేతలు ఆందోళ చేపట్టారు. కేంద్రానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ గ్రూపు వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆప్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో అక్కడి వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారింది. మరో వైపు హైదరాబాద్ లోని నాంపల్లిలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. అదానీ మెగా కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తోన్న ఆప్ నాయకుడు డాక్టర్ సుధాకర్ తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించారు.