
ట్యాంక్ బండ్, వెలుగు: నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వేదికగా నవకర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ్- 2025 పేరిట సీజన్ 8 వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కవిత, సలోని జైన్ తెలిపారు. మనేపల్లి జ్యువెలర్స్, అన్విత సహకారంతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్1 వరకు ఈ వేడుకలు జరుగుతాయన్నారు.
ఆదివారం జలవిహార్లో బాలీవుడ్ గర్బా కొరియోగ్రాఫర్ జిగర్ సోనీ, గుజరాతీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జిగ్నేష్ దోషీ, అన్విత, అచ్యుత్ రావు, మనేపల్లి జ్యువెలర్స్ గోపీ కలిసి ఎంట్రీ పాస్ పోస్టర్ను ఆవిష్కరించారు. యువతులకు గర్బా, దాండియా నృత్యంపై జిగర్ సోనీ వర్క్షాప్ నిర్వహించారు. ఈ ఉత్సవంతో ప్రతిరోజు మహా ఆర్తి, వైవిధ్యమైన ఫుడ్ కోర్ట్, సెలబ్రిటీ సందర్శనలు, బహుమతులు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.