
జగదీష్ ఆమంచి హీరోగా, దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘యముడు’. 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ట్యాగ్ లైన్. శ్రావణి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పాడు. మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్గా దీన్ని రూపొందించారు.
సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అనేలా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ ఆకట్టుకుంది.