సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌గా యముడు .. టీజర్‌ రిలీజ్ చేసిన హీరో నవిన్ చంద్ర

సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌గా యముడు .. టీజర్‌ రిలీజ్ చేసిన హీరో నవిన్ చంద్ర

జగదీష్ ఆమంచి హీరోగా, దర్శక నిర్మాతగా రూపొందించిన  చిత్రం ‘యముడు’. 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ట్యాగ్ లైన్.  శ్రావణి శెట్టి హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌ను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దీన్ని రూపొందించారు. 

 సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అనేలా సస్పెన్స్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేస్తూ కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.  ‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ ఆకట్టుకుంది.