నవీన్ మృతదేహం తరలింపుపై రాని స్పష్టత

నవీన్ మృతదేహం తరలింపుపై రాని స్పష్టత

ఉక్రెయిన్ పై రష్యా దాడుల్లో  అటు సైన్యంతో పాటు ఇటు పౌరులు కూడా ప్రాణాలు విడుస్తున్నారు. నిన్న కర్ణాటకకు చెందిన నవీన్ అనే వైద్య విద్యార్థి ఉక్రెయిన్ లోని ఖర్కీవ్ లో చనిపోయిన సంగతి తెలిసిందే.  దీంతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది.  అయితే నవీన్ మృతదేహం భారత్ కు తరలింపుపై  ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ డెడ్ బాడీని తరలించడం కష్టమని ఉక్రెయిన్ అధికారులు భారత ఎంబసీకి చెప్పినట్లు సమాచారం. మరో వైపు నవీన్  తల్లిదండ్రులు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. తన కొడుకు చివరి చూపు కోసం తపిస్తున్నారు. మృతదేహాన్ని తమకు  అప్పగించాలని కోరుతున్నారు నవీన్ తండ్రి శేఖరప్ప జ్ఞానగౌడర్ .  కర్ణాటక ప్రభుత్వం కూడా నవీన్ మృతదేహం తరలింపునకు ప్రయత్నాలు  చేస్తోంది.

For More News..

నాటి కమెడియన్... నేటి ఉక్రెయిన్ అధ్యక్షుడు