![శిల్పారామంలో కనుల పండువగా నవరాత్రి వేడుకలు](https://static.v6velugu.com/uploads/2023/10/navratri-festival-continues-in-shilparam-of-madapur_AutMRX49y8.jpg)
మాదాపూర్ వెలుగు: మాదాపూర్ శిల్పారామంలో నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో భాగంగా శిల్పారామానికి తరలివచ్చే సందర్శకులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా శారీ మేళా సందర్శకులను ఆకట్టుకుంటున్నది.
కల్చరల్ ప్రోగ్రామ్స్లో భాగంగా మంగళవారం రేణుక ప్రభాకర్ శిష్య బృందం ప్రదర్శించిన దక్ష యజ్ఞ అష్టాదశ శక్తి పీఠాలు కూచిపూడి, అర్చన మిశ్రా, సోనాల్ శిష్య బృందం ప్రదర్శించిన కథక్ నృత్యం అలరించింది.