అప్పులు తీర్చేందుకు పాక్ మహిళతో డీల్.. దేశ రక్షణ సమాచారం లీక్ చేసిన నేవీ క్లర్క్.. ఢిల్లీలో అరెస్ట్

అప్పులు తీర్చేందుకు పాక్ మహిళతో డీల్.. దేశ రక్షణ సమాచారం లీక్ చేసిన నేవీ క్లర్క్.. ఢిల్లీలో అరెస్ట్

పహల్గాం దాడి.. ఉగ్రవాదులు 26 మంది అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దారుణ ఘటన. పేరు అడిగి మరీ అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ గటనను సీరియస్ గా తీసుకున్న భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరున పాక్ ఉగ్రస్థావరాలను పేల్చేసింది. అదే క్రమంలో పాక్ సైనిక స్థావరాలపై కూడా దాడి చేసింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పేందుకు ఇండియా చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు సైన్యం భీకరంగా పోరాడుతుంటే.. ఎవరేమైతే నాకేంటి.. నా స్వలాభం నాకు ముఖ్యం అన్నట్లుగా రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశాడు నేవీ (నౌకాదళం) క్లర్క్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. 

ఢిల్లీ నేవీ ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేస్తున్న విశాల్ యాదవ్ అనే క్లర్క్ ను బుధవారం ( జూన్ 25) అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. హర్యాణ రాష్ట్రంలోని పున్సిక గ్రామానికి చెందిన విశాల్.. ఆపరేషన్ సిందూర్ టైం లో కీలకమైన సమాచారాన్ని అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ నౌసేన భవన్ లో డైరెక్టరేట్ ఆఫ్ డాక్ యార్డ్ అప్పర్ డివిజన్ ల క్లర్క్ గా పనిచేస్తున్నాడు విశాల్. 

పాకిస్తాన్ హ్యాండ్లర్ తో చాలా రోజులుగా కాంటాక్ట్ లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ప్రియా శర్మ పేరున సోషల్ మీడియా వేదికగా ఇతనికి ఎర వేసి ట్రాక్ లో పెట్టినట్లు చెప్పారు. గత కొన్నాళ్లుగా పాక్ తో ఎవరెవరు సంబంధాలు పెట్టుకున్నారో సీక్రెట్ గా ట్రాక్ చేస్తూ వస్తున్నామని.. విశాల్ యాదవ్ డైరెక్ట్ గా పాకిస్తాన్ నెట్వర్క్ తో టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. 

ALSO READ | Gold: బిర్లాల దగ్గరే బంగారం కొట్టేసిన కేటుగాళ్లు : సైబర్ ఎటాక్ చేసింది ఎవరు.. ఏ దేశం నుంచి..?

నేవీ కార్యాలయం నౌసేన భవన్ కు సంబంధించిన కీలక సెన్సిటివ్ సమాచారాన్ని డబ్బులు తీసుకుని పాకిస్తాన్ కు అమ్ముకున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. జైపూర్ లో ఇంటెలిజెన్స్ సంస్థలు విడివిడిగా విశాల్ ను విచారించాయి. ఆన్ లైన్ గేమ్స్ కు అడిక్ట్ అవ్వడంతో అప్పులపాలు అయినట్లు విచారణలో తేలింది. 

గేమ్స్ ఆడేందుకు.. అదేవిధంగా అప్పులు చెల్లించేందుకు డబ్బులు కావాల్సి ఉండటంతో కీలక డాక్యుమెంట్లు పాకిస్తాన్ ఏజెంటుకు అమ్ముకున్నాడు. రిటర్న్ గా క్రిప్టో కరెన్సీ లో డబ్బులు రిసీవ్ చేసుకున్నట్లు విచారణలో చెప్పాడు. మొబైల్ లో చాలా వరకు చాటింగ్ ను గుర్తించారు అధికారులు. అదే విధంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో కీలక పత్రాలను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకున్నట్లు అంతీకరించాడు. ఈ పరిణామల క్రమలో రాజస్థాన్ సీఐడీ అధికారులు రెడ్ హ్యండెగ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.