హారర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ గూస్ బంప్స్ తెప్పిస్తుంది : డైరెక్టర్ అశ్విన్ శరవణన్

హారర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ గూస్ బంప్స్ తెప్పిస్తుంది : డైరెక్టర్ అశ్విన్ శరవణన్

హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ‘కనెక్ట్’ మూవీ గూస్ బంప్స్ తెప్పిస్తుందని దర్శకుడు అశ్విన్ శరవణన్ అన్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 22న యూవీ క్రియేషన్స్ తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తోంది. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దిట్ట అయిన అశ్విన్... గతంలో నయనతార కథానాయికగా ‘మయూరి’, తాప్సీ హీరోయిన్ గా ‘గేమ్ ఓవర్’ చిత్రాలను తెరకెక్కించి ఘన విజయం అందుకున్నారు. ‘కనెక్ట్’ రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా దర్శకుడు అశ్విన్ శరవణన్ చిత్ర విశేషాలు తెలిపారు.

లాక్ డౌన్ లో కుటుంబాలు కలిసి లేవని, ఏదో పని మీద మరో ప్రాంతానికి వెళ్లిన వాళ్లు అక్కడే స్ట్రక్ అవుతారన్నారు. అలా ఒక కుటుంబంలోని తల్లీ కూతురు ఇంట్లోనే ఉండిపోతారని, కొద్ది రోజులకు కూతురి ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయని తెలిపారు. ప్రేతాత్మ ఆవహించినట్లు ఆమె బిహేవ్ చేస్తుందని..ఈ పరిస్థితుల్లో బిడ్డను తల్లి ఎలా కాపాడుకుంది ? అనేది ఈ సినిమా కథ అన్నారు.- ఆ పాపను ఆవహించిన ఆత్మను పోగొట్టేందుకు తల్లి ఫాదర్ అగస్టీన్ హెల్ప్ కోరుతుందని, ఈ క్యారెక్టర్ లో అనుపమ్ ఖేర్ నటన ఆకట్టుకుంటుందన్నారు. 

‘ఈ చిత్రంలో ఇంటర్వెల్ ఉండదని, హార్రర్ థ్రిల్ పంచుతూ ఏక బిగిన కథ సాగుతుంటుంది. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది కాబట్టి చూడటం సులువు. సినిమాను కంటిన్యూగా చూడటంలో ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడరని అనుకుంటున్నా. ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి పద్ధతిలో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. అప్పుడు థియేటర్లో ఆరేడు షోస్ ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది’. అన్నారు.