హనుమకొండ, వెలుగు : వరంగల్ కమిషనరేట్ పరిధిలో భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తూ తుపాకీతో బెదిరించిన కేసులో నయీం గ్యాంగ్సభ్యుడు ముద్దసాని వేణుగోపాల్ను కేయూ పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 29న కేసు నమోదు కాగా.. నెలన్నర తరువాత అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ పెగడపల్లి డబ్బాల ప్రాంతంలోని తన ఇంటికి సోమవారం రాగా పట్టుకొని పరకాల సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి నుంచి రూ.18 లక్షల క్యాష్, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. హనుమకొండ ఆరెపల్లి వద్ద ఓ భూవివాదం విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఆయననే తుపాకీతో బెదిరించడంతో హసన్పర్తి, కేయూ, హనుమకొండ పీఎస్ల పరిధిలో వేణుగోపాల్, ములుగు జిల్లాలో పని చేసే రిజర్వ్ఇన్స్పెక్టర్ సంపత్ సహా 10 మందిపై జులై 29న పోలీసులు కేసులు నమోదు చేశారు. తర్వాత రోజు ఆరుగురిని, ఆగస్టు 20న ఆర్ఐ సంపత్ ను అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులకు వేణుగోపాల్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. .