రైతుబంధు వారోత్సవాల్లో విద్యార్థులు

రైతుబంధు వారోత్సవాల్లో విద్యార్థులు

రైతుబంధు వారోత్సవాల్లో NCC విద్యార్థులు పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శంషాబాద్ మండలం మల్కారం గ్రామంలో గ్రామ సర్పంచ్, వ్యవసాయ శాఖ అధికారులు రైతుబంధు వారోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‎తో పాటు స్థానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అయితే రైతుబంధు వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 40 మంది NCC విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో ప్రజలు, పలువురు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో NCC విద్యార్థులను ప్రభుత్వ కార్యక్రమాలలో ఎలా భాగస్వామ్యం చేస్తారంటూ ఫైర్ అవుతున్నారు.

For More News..

లతా మంగేష్కర్‎కు కరోనా.. ఐసీయూలో చికిత్స

శ్మశానంలో ఫ్రెండ్ బర్త్ డే

రోడ్ల దుస్థితిపై చిన్నారి రిపోర్టింగ్