లతా మంగేష్కర్‎కు కరోనా

లతా మంగేష్కర్‎కు కరోనా

తన గొంతుతో అందరినీ కట్టిపడేసే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారినపడ్డారు. ఆమెకు తేలికపాటి లక్షణాలున్నాయని లతా మంగేష్కర్ మేనకోడలు రచనా తెలిపారు. ప్రస్తుతం లత ఐసీయూలో ఉన్నారని ఆమె చెప్పారు. 

‘ఆమె బాగానే ఉంది. ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే ఐసీయూలో చేర్చారు. లతా కోసం ప్రార్థనలు చేయండి’ అని లతా మంగేష్కర్ కోడలు రచనా తెలిపారు. 

గతేడాది కరోనాతో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించారు. ఆయన సెప్టెంబర్ 25, 2020న కరోనాతో మృతిచెందారు. ఇప్పుడు లతా మంగేష్కర్ కరోనా బారినపడటంతో సినీప్రియులు ఆందోళనలో ఉన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

For More News..

శ్మశానంలో ఫ్రెండ్ బర్త్ డే

రోడ్ల దుస్థితిపై చిన్నారి రిపోర్టింగ్