లూసాన్ : ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రకటించిన హాకీ ఫైవ్స్ ర్యాంకింగ్స్లో ఇండియా మెన్, విమెన్స్ టీమ్స్ రెండో ర్యాంక్ సొంతం చేసుకున్నాయి. మెన్స్లో ఇండియా.. ఒమన్, మలేసియాతో కలిసి సంయుక్తంగా రెండో ర్యాంక్లో నిలిచింది. ఈ మూడు జట్లు తలో 1400 పాయింట్లతో ఉన్నాయి. వరల్డ్ కప్ గెలిచిన నెదర్లాండ్స్ (1750 పాయింట్లు) టాప్ ర్యాంక్లో ఉంది.
విమెన్స్ వరల్డ్ కప్లో గోల్డ్ నెగ్గిన నెదర్లాండ్స్ నంబర్ వన్ ర్యాంక్ నిలబెట్టుకుంది. ఆ టీమ్ ఖాతాలో 1750 పాయింట్లు ఉండగా.. ఇండియా విమెన్స్ టీమ్ 1550 పాయింట్లతో రెండో ర్యాంక్లో నిలిచింది.